పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

423


వ్విపులాశ్రమతలమున నా
చపలాక్షిని నిల్పె మదిని సంశయపడకన్.

32


క.

హరియంశము గల మునిపై
నరమర మది నుంచుకొనక యంబుధితనయం
దిరవుగ నిలిచి నివేశుని
స్థిరముగ మనసునను బూజ సేయుచు నుండెన్.

33


సీ.

అటుమీఁద శ్రీవేంకటాద్రినాయకుఁడు ప్రా
        తఃకాలమున లేచి తప్తహేమ
చేలభూషణములు చెలువుగ ధరియించి
        గరుడవాహన మెక్కి గరిమ యెసఁగ
నటఁ బోయి వచ్చెద ననుచుఁ బద్మావతి
        కనుకూలముగఁ జెప్పి ఘనత మెఱయ
నందుస్న వకుళతో నావరాహస్వామి
        తోఁ జెప్పి కదలి సంతోషముగను


తే.

బోయి శ్రీకరకరవీరపురమునందుఁ
బద్మమందిర యున్నట్టి భవనమునకు
జేరి యందందు వెదకి యాక్షీరవార్థి
కన్యకామణి లేనట్టికతమునకును.

34


శా.

ఖిన్నుండై మది నేమి దోఁచ కచటం గ్లేశాత్ముఁ డై సారెకుం
గన్నీ రూరక నింపుచున్ వెదకుచుం గామాతురుం డై మహా
పన్నుండై యకట రమాతరుణి నాపై మోహమున్ లేక యిం
దిన్నాళ్లుం డిపు డెందు డాఁగినదొ నే నింకేడ శోధింపుదున్.

35


సీ.

అని చింత సేయుచు నచట నుండక పోయి
        పర్వతాదులఁ జూచి పలికెఁ జక్రి