పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

418

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

దాఁచకయ చెప్పు మనుచుఁ బాదములమీఁద
ఫాలమును జేర్చి విడువక బహువిధముల
వినుతిసేయుచు నడుగఁగ విడువదనుచు
సతిని గరములతో నెత్తి హితము మెఱయ.

14


క.

లాలింపుచుఁ బద్మావతి
నాలింగన మారఁజేసి యన్యోన్యముగా
శ్రీలక్ష్మీశ్వరుఁ డపు డా
హేలావతి మోము చూచి యిట్లని పలికెన్.

15


సీ.

వినవె పద్మావతి వివరంబుగా నీకుఁ
        జెప్పెద నెట్లన సృష్టి లేని
కాలంబునం దొంటిగా నిర్వికారుండ
        నయి నిర్గుణబ్రహ్మ మగుచు నుంటి
నాయం దనాదియై పాయక మూలప్ర
        ధానమ మాయాభిధాన మొంది
చిద్రూపమై లక్ష్మి సద్రూప మై నన్నుఁ
        బొందఁగ నప్పు డానంద మొదవె


తే.

నందు మహదాదితత్వంబు లన్ని వొడమె
వాని మేళనమున సృష్టి వరుసగాను
బట్టుగాఁ బుట్టి సర్వప్రపంచమయ్యె
నప్పు డంతటికిని గర్త నగుచు నేను.

16


క.

అది మొదలుగ బ్రహ్మాదుల
పదపడి పుట్టింతు నీప్రపంచము నాలోఁ
గుదురై యుండును వెలిపెం
పొదవుచు నీరీతి వెల్గుచుండు మృగాక్షీ.

17