పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

417


తనమదిలోఁ దాను దలఁచె నిమ్మెయి సిరి
        నెడఁబాసి నరుఁడ నై యిన్నియేండ్లు
గడపుచు నుంటి నింక నెడంబునం దుంచి
        యుండుట పాడిగా దుదధిసుతను
వక్షమునం దుంచవలెఁ గాని యేరీతి
        నైనఁ బ్రార్థించి నెయ్యంబు నిటకు


తే.

నేను దోడ్కొని రాకున్న నిఖిలకార్య
ములును సంపూర్తిగావు పెంపుగ యశంబు
దక్కదు కుబేరునకు ఋణధన మొసంగు
టకు నుపాయంబు లేదు దృఢంబు తలఁప.

12


తరల.

నిరతము న్మదిఁ జింతఁ జేయుచు నీరజేక్షణుఁ డార్తుఁడై
నరునిచందముగా విరక్తుఁ డనంగ నొప్పుచు సర్వమున్
మఱచి తాఁ దను జూచుచుండెడి మౌనిమాడ్కిని పద్మమం
దిరవిలాసగుణంబులెల్ల మదిం దలంచుచు నుండఁగన్.

13


సీ.

అపుడు పద్మావతి హరి సర్వవై రాగ్య
        కలితుఁడై యున్నలక్షణములెల్ల
భావించి భావించి భయమొంది యొక్కనాఁ
        డేకాంతసమయమం దిట్టు లనియె
శ్రీస్వామి యిపుడు మీచిత్తంబునం జింతఁ
        బుట్టుట మీముఖాంబుజమునందుఁ
గనిపించుచున్న దిక్కాలమం దరుడుగ
        నిటు చింత వొడమిన హేతు వేమి