పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

419


క.

ఇంత మహత్వం బా శ్రీ
కాంతకటాక్షమున నాకుఁ గలిగిన దిపు డా
యింతి నెడబాసి యుండుట
కెంతయుఁ జింతింపుచుందు నిందునిభాస్యా.

18


సీ.

అద్వయబ్రహ్మంబు నై నిరాకారమై
        యచలమై నున్న నాయందుఁ బొంది
ఘనసుందరాకారమును నాకుఁ గల్పించి
        తగు సుందరాంగియై తాను నిల్చి
గురుతరకల్యాణగుణములు నా కిచ్చి
        నను గొప్పచేసె నానాఁటనుండి
చంద్రునియందున్న చంద్రికవిధముగ
        వెలయుచు నాయురస్థలిని నిలిచి


తే.

వేడ్కమై నుండఁగా నొకవేళ భృగుఁడు
వచ్చి సిరియున్న యురముపై వఱలఁ దన్నె
నందుచే లక్ష్మి నాయందు నలుక చేసి
విరసములు పల్కి కరవీరపురము చేరె.

19


క.

అప్పుడు సర్వజ్ఞత్వము
తెప్పున నను విడచి లక్ష్మిదేవిం బొందెం
దప్పక యమ్మార్గంబును
దప్పక యీగిరికి వచ్చి దైన్యముచేతన్.

20


సీ.

విలసిల్లఁ దింత్రిణీవృక్షమూలమున
        నున్న వల్మీకాన నుంటి నపుడు
నాకు సర్వజ్ఞత లేకుండె నప్పుడు
        తేఱకు గొల్లచే దెబ్బవడితి