పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

363


బున వివిధవాద్యాదులు మ్రోయుచుండ నాందీప్రముఖవిధి
విహితకర్మకలాపంబు లాచరించె నంత.

200


సీ.

అస్తమయముగాఁగ హరితోడ విడిదిలో
        బ్రహ్మరుద్రాదులు పవ్వళించి
నిదురించి రావల నుదయపర్వతముపై
        నరుణోదయంబయ్యె నపుడ లేచి
యందఱు స్నానసంధ్యాదికృత్యంబులు
        నెఱవేర్చి రంతట హరియు స్నాన
సంధ్యాదు లొనరించి సంతోషమారంగ
        నావసిష్ఠులఁ జూచి యనియె నిట్లు


తే.

నేను లక్ష్మియు నజుఁడును నీవు వకుళ
మాలికయు భుక్తిఁ గొనక నేమమున సుండ
వలెఁ గదా కన్య నొసఁగెడివారలింట
నవ్విధంబుండవలెఁగదా యనుచు మఱియు.

201


తే.

తొండమానుండుసు బురోహితుండు నైన
సురగురుండు భుజింప కచ్చోటఁ దగిన
నియమమున నుండవలెఁగదా! నిలిచినట్టి
వారలందఱు భుజియింపవచ్చుఁ గనుక.

202


వ.

త్వరగ బ్రాహ్మణభోజనంబు సేయింపందగు ననిన విని వసి
ష్ఠుండు కుబేరుని కాయుదంతంబంతయుం జెప్పి పంప నతం
డరిగి యువాసనియమసంతర్పణప్రకారం బాకాశరాజుకుం
జెప్ప నృపాలుండు సంతసించి మధ్యాహ్నంబునకు బ్రాహ్మణ
సంతర్పణంబు సేయించి యొక్కొక్కనిష్కంబు దక్షిణ లిచ్చి
ప్రొద్దుగ్రుంకినపదమూఁడు గడియలకు ముహూర్తంబు