పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గావలయుఁ దగు మంగళద్రవ్యంబులు వివాహమంటపవేదిక
యందు నుంచవలయు నని పరిచారులకు నియమించి పురో
హితబంధుమిత్రకళత్రజనాదులతో ధరణీదేవి సువా
సినులం దోడ్కొని సాయంసమయంబున మంగళవాద్యం
బులతో హరియుండు విడిది మందిరంబున కేగి నక్షత్రగణ
పరివృతుండైన సుధాకరుని చందంబున నజశంకరుల నడుమ
నవరత్నపీఠంబునం గూర్చునియుండు హరిని జూచి యానం
దించి వసిష్ఠాదిమునులం జూచి స్వామివారిం దోడ్కొని
మద్గృహంబునకు రావలె నని ప్రార్థించె నపు డాస్వామిని
పసిష్ఠుండు పూజింపు మని చెప్పిన విని ధరణీదేవి సంకో
చంబున నరుంధతిని మున్నిడుకొని భయభక్తు లెసంగ
నాస్వామికి దివ్యవస్త్రాభరణచందనతాంబూలంబు లర్పించి
పుష్పహారంబు కంఠంబున నుంచి కృతార్థురా లైతి నని సంతో
షించెఁ దొండమానుఁడు సభాసదులకుం జందనపుష్పతాంబూ
లంబు లిప్పించె ననంతరంబు.

203


సీ.

ఐరావతముమీఁద హరిని శ్రీసతి నుంచి
        కొని రాజవీథులం గోరి రాఁగ
వేడ్కమై వరచతుర్వేదఘోషణములు
        ఘనయక్షగంధర్వగానములును
మిన్నంది ఘోషింప మెఱయుచు రంభాది
        వనితలు నృత్యముల్ వఱల సల్ప
ఘనతరకరదీపగగనబాణంబులు
        పెక్కుదిక్కులను దీపింపఁగాను