పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

362

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నేములధ్వను లొప్పార నెమ్మి మాగ
ధులు ముదంబున బిరుదులు చెలఁగి వొగడ.

198


తే.

గొడుగు శేషుఁడు పట్టఁగఁ గుడియెడమల
నమర పవనుండు వరచామరములు వీవ
భక్తి మెఱయంగ సేనాధిపతి ముదమున
నాలవట్టముపట్ట శేషాద్రి డిగ్గి.

199


వ.

నేల యీనిన చందంబున నెఱసి కపిలతీర్థమార్గంబునం జని
చని శుకాశ్రమంబునకుఁ బోవుచుండఁగ నాశుకుండు స్వామి
కెదురువచ్చి తోడ్కొనివోయి సుస్థలంబునం దుంచి నిజ
యోగప్రభావంబున సకలపదార్థాకర్షంబు చేసి హరిహర
బ్రహ్మాదులకు విందు చేయించె నయ్యష్టమినాఁటిరాత్రి హరి
గంధర్వయక్షకిన్నరగానంబు లాలకించుచు రంభాద్యప్సర
స్త్రీలనృత్యంబు లీక్షించుచు సామగానంబులు విని విని
చొక్కి సుమశయ్య విశ్రమించి లేచి యమ్మరునాఁడు నారా
యణవనపురసమీపంబుసకు నాకాశరాజు పురోహితామాత్య
జనసమేతుఁడై చతురంగబలములతోడ నాచక్రి కెదురుగ
వచ్చి పూజాలింగనాదిసత్కృత్యంబు లాచరించి కడువైభ
వంబునం బురమార్గంబున వేడ్కం దోడ్కొనివచ్చి విడిది
గృహంబున నుంచి హరికి సంతోషం బొనరించి నిజమందిరం
బున కేగి తొండమానుని శౌరిసాన్నిధ్యంబునకుఁ బంప
నతండు వచ్చి హరిహరబ్రహ్మాదులకు నమస్కరించి గౌరవం
బున భోజనంబులు చేయించి తాంబూలంబు లిప్పించి గృహం
బున కేగి గురువాక్యప్రకారంబున నాకాశరాజు భార్యా
పుత్రికలతోడ సన్మంగళస్నానంబులు చేసి వివాహమండపం