పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

357


పిలిపించె నిఁకనైనఁ బ్రేమమై నురమునం
        దుంచును గద యని యెంచి నమ్మి
వచ్చితి శ్రీరమావనిత నాహరి తేఱఁ
        జేసినవిధము చూచితిని గనులు


తే.

చల్లనాయెను నేను నాచలము దీఱ
నేమి సేయుదు నను గ్రోధ మినుమడింప
శ్రీశునేత్రాబ్జములనిండ శీతకిరణ
జాలమును జొన్పి ముకుళింప సరగఁజేతు.

176


తే.

రెండుజాములు దనుక యీరీతి మేను
మఱచి నిదురించు మోబావమఱఁది యనుచు
హెచ్చి హిమకిరణుఁడు శాపమిచ్చెనేమొ
యనఁగ హరి నిద్రవోయె దేహంబు మఱచి.

177


తే.

తలిరుఁబానుపుపై విశ్వతైజసులను
నడచి ప్రాజ్ఞుని దాఁటి యఖండతుర్య
మం దమరఁ బొంది తదతీత మైనసుఖము
ననుభవించుచునుండెఁ బద్మాక్షుఁ డచట.

178


క.

అంతట నలరులపై శ్రీ
కాంతామణి నిదురఁ జెందఁగాఁ జూచి కడుం
జింతాక్రాంతమనంబున
సంతోషము లేక చిక్కి సగమగుపగిదిన్.

179


సీ.

శుక్లపక్షమునాఁటిసోముఁ డాలోచించి
        తలఁచె నిమ్మెయి రమాతరుణి కిచట
నలుక దీఱిచి వక్షమం దుంచికొనియుండ
        కాకాశరాజేంద్రునాత్మసుతను