పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దాఁ బెండ్లియాడుట దలఁచె గదా హరి
        దయ లేనివాఁ డయ్యె ధాతగూడ
నిపుడైన నురమునం దిందిర నిడుకొని
        యేలంగ మేలు మఱేల పెండ్లి


తే.

యనుచు మునులైనఁ జెప్పక యలరువారు
కాని వీరికి వనములఁ బూని పోవు
నపుడు చీకటి చేయింతు నఁనఁగఁ బశ్చి
మాబ్ధి కేగుదు నని చంద్రుఁ డరుగుచుండె.

180


చ.

తమవిభుఁ డల్గిపోవఁ గని తారలు విన్నఁదనంబు నొందుచుం
గ్రమముగఁ జంద్రుతోడుతన గ్రక్కునఁ బోవుచు నుండె సప్పుడే
కుముదవరాప్తుఁ డేగుటకు గ్రూరుఁడు వచ్చుట కార్తినొందుచున్
భ్రమయుచు నీటియం దొదుగుభావముతో ముకుళించె ఖిన్నతన్.

181


ఉ.

అప్పుడు చంద్రుఁ డేగె నిఁక నంబుజమిత్రుఁడు జాముప్రొద్దు కే
తెప్పున వచ్చువాఁడు చనుదేరక మున్నె విరించిముఖ్యులం
దప్పక చూడవచ్చును గదా యని నల్లన చీరఁగట్టి వే
యొప్పుగ మబ్బుచాన చనుచున్న దనం దగఁ గ్రమ్మెఁ గొండపై.

182


సీ.

ఆచీఁకటిని జూచి యద్రిరూపమునున్న
        పన్నగేంద్రుఁడు నిజఫణము లెత్తి
హరిహరబ్రహ్మాదు లంగనలను గూడి
        యుండఁగఁ జీఁకటి యుండఁదగునె
యని ఫణామణుల నత్యంతముగా వెల్గఁ
        జేసినాఁ డన నద్రిఁ జెన్ను మీఱ