పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దంబు నొందుచుండఁగ మన్మథునిచేత నంజనీసుతునిచేత దివ్య
తాంబూలంబు లొసంగఁ జేసి బ్రహ్మ ధనదునివలన దక్షిణ లిప్పిం
చె. శ్రీహరి లేచి యాబ్రాహ్మణశ్రేణికి నమస్కారంబు సేయ
వాకు మంత్రాక్షతల నాశీర్వచనంబులు నేసిరి. అవి తాఁ గొని
పుత్రకళత్రాదులకును భటులకును శిరంబులం గరంబర్థి
వైచి తా సంతోషమగ్నుండయ్యె. అంత హరిహరబ్రహ్మేం
ద్రాదులు తమనిజభార్యాసమేతులై సంతసంబార భుజించిరి.
హవ్యవాహనపవనమన్మథకార్తికేయాంజనేయాదులు భుజించి
భూతగణాదులకును, తదితరులకును, మృష్టాన్నభోజనంబు
లం బరితృప్తి గావించిరి. పాకపాత్రంబు లందుండు చారులు
పరిశుద్ధంబు చేసి పెట్టి రంత.

166

సూర్యాస్తమయ చంద్రోదయ సూర్యోదయములవర్ణనము

తే.

హరివివాహంబునకు వచ్చినట్టి బ్రహ్మ
ముఖ్యులందఱు భోజనములను జేసి
రింక నిచ్చట నాకుండ నేమి మేరు
భూధరంబున నాదిక్కుఁ బోయి వత్తు.

167


తే.

చంద్ర నీ వింక వేంకటాచలముమీఁద
సకలసురమునిముఖ్యులు సంతసించు
కొఱకు వెన్నెల నంతట నెఱపు మనుచుఁ
జెప్పి చనినట్ల యపరాద్రిఁ జేరె నినుఁడు.

168


సీ.

అబ్జబాంధవుఁ డిట్టు లపరాబ్ధిఁ గ్రుంకఁగ
        నపు డహిగిరినుండునట్టి లక్ష్మి
మొదలైనసతులను ముచ్చటగాఁ జూడ
        హేమాంబరము ధరియించి పద్మ