పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

355


రాగభూషణములు రక్తచందనమును
        బసుపుకుంకుము దాల్చి భక్తి మెఱయ
పశ్చిమాశాకాంత పైనమై వచ్చెనో
        యనఁగ సంధ్యారాగ మతిశయిల్లె


తే.

నందుచేఁ బార్వతీప్రముఖాబ్జముఖుల
మణుల భూషణముల రక్తిమములు మించెఁ
బక్షు లారత్నములు చూచి ఫలము లనుచు
మెక్కుటకుఁ బొందుగతి చెట్లమీఁద వ్రాలె.

169


తే.

విపులనీలాంబరమునిండ విమలమౌక్తి
కముల గుమిగూర్చి శేషనగంబుపైనఁ
గట్టునటువంటి [1]చందువాకరణిఁ దార
కంబు లంతంతకు నభంబుఁ గ్రాలె నపుడు.

170


సీ.

జలధి నుప్పొంగించి జలరుహపంక్తుల
        నీక్షించి నోళ్ల మూయించి మించి
కుముదసంతతులను బ్రమదంబు నొందించి
        తొలఁగక శుభ్రకాంతులను బెంచి
విరహుల నలయించి విరసము ల్గలిగించి
        చక్రవాకులవేడ్క లాక్రమించి
చీఁకటిఁ గబళించి చిగురుటాకుల దీప
        ములమాడ్కి వెల్గించి మొనసి యెంచి


తే.

చలువచీఱెలు సానుదేశముల నిండఁ
బఱచినటువలె వెన్నెలఁ బ్రబలఁజేసి

  1. చందువ = మేలుకట్టు, సోసానము