పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

353


నంబునకు లెండని వచింప హరి విని కార్తికేయుని పిల్చి
బ్రాహ్మణభోజనంబునకు విశాలప్రదేశంబు లేకుండుటం జేసి
శంభుని నానతిచొప్పున భూతగణంబులం దోడ్కొని పాండవ
తీర్థము మొదలు శ్రీశైలముపర్యంతము నేలం జదరంబు
సేయింపు మనిన నతం డట్లు చేయించె, నంత నందఱు స్నాన
సంధ్యాద్యనుష్ఠానాదు లొనర్చుకుని బంతులుగఁ గూర్చుండ
నప్పు డజునిఁ జూచి యనర్పితాన్నంబు బ్రాహ్మణులకు యో
గ్యంబు గాదనియు నహోబలనారసింహున కర్పితంబు సేయు
మనియుఁ జెప్ప నప్పద్మజుం డట్లు చేసి వైశ్వదేవబలిహరణాది
నిత్యకర్మకలాపంబుల నంతరంబు చేసి బ్రాహ్మణులకు నుచితా
సనంబు లిచ్చె. శ్రీనివాసుండు నియమించిన రీతిం బవనుండు
కదళీపర్ణంబులు బంతులుగ వైచి ఘృతలాంఛన మిడి సకల
పదార్థంబులను వడ్డించె. బ్రహ్మ గంధపుష్పాక్షతంబుల ద్విజా
ర్చనంబు చేసి వరుణుండు బ్రాహ్మణులకును సుమంగిలీశ్రేణు
లకు నాపోశనాంబువు లిచ్చె. వసిష్ఠుండు "ఏకోవిష్ణుర్మహద్భూ
తం" బనుచు వచింప నందఱును జెప్పుచుం గృష్ణార్పణ
మ స్తని పంచప్రాణాహుతు లిడుకొనఁ బవనుండు హస్తోద
కంబు నొసంగె. మన్మథుండు నాంజనేయుండును బంతులఁ దిరు
గుచుం బ్రొద్దయ్యె నిదానంబున భుజింపుఁ డని యుపచారం
బులు చెప్పుచుండిరి. భక్ష్యభోజ్యలేహ్యపానీయంబులతో
బరితృప్తిం బొంది యజునివలన నుత్తరాపోశనంబు గైకొని
లేచి పాణిపాదప్రక్షాళనంబు నాచమనంబును జేసుకొని హరి
నియమింపఁబడిన రమ్యస్థలంబునం గూర్చుండి “తృతీయస్యామి
తోదివిసోమ ఆసీత్” అనుచుఁ జెప్పు వేదధ్వనికి హరి యానం