పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

29


నంతకంటె ముఖ్యమని వేంకటాద్రిపై
జక్రధరుఁడు నిల్చె సంతసముగ.

103


సీ.

అనినఁ దాపసు లిట్టు లనిరి శేషాద్రి క్రీ
        డాద్రి వేంకటగిరి యనఁగ మూఁడు
నామధేయంబు లేమేమి కారణమునఁ
        గల్గెను వినిపింపు గరుణ ననఁగ
విని సూతుఁ డిట్లనె మునులార మూడభి
        ధానంబులే కావు పూని చెప్ప
ధరణి నొక్కొకనిమిత్తమున నొక్కొకపేరు
        చెలఁగుచుండును శేషశిఖరి కెపుడు


తే.

గాన నాయాయివృత్తాంతగౌరవములఁ
జూచి భావించి నామదిఁ దోఁచినంత
వఱకుఁ జెప్పెద మీరలు వరుస వినుఁడు
ప్రీతి మెఱయంగ ననుచును సూతుఁడనియె.

104


క.

చింతించినయర్థము లిపు
డెంతయు లేదనక జనుల కిచ్చచునుండున్
సంతోషంబున గిరిపైఁ
జింతామణి యనఁగఁ బేరు చెలఁగెను జగతిన్.

105


క.

జ్ఞానం బించుక గల్గిన
మానవు లయ్యద్రి నుండ మహితజ్ఞానం
బానాట వృద్ధిచెందును
దానన్ జ్ఞానాద్రియంచు ధరపే రొప్పెన్.

106


క.

అర్థముఖము లగుగోర్కెలు
సార్థకములు చేసి జనుల సంరక్షింపం