పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దీర్థాదు లుండ నయ్యది
తీర్థాచల మనగఁ బేరు దీపితమయ్యెన్.

107


క.

నిష్కామతపోధనుఁలకుఁ
బుష్కలముగ స్నానపానపూజ లొనర్పం
బుష్కరిణులు గల్గుటచేఁ
బుష్కరశైలం బనంగఁ బొలుపొందు ధరన్.

108


క.

మును వృషభాసురుఁ డనియెడి
యనిమిషవైరుండు దానియం దుండి తపం
బొనరించిన కారణమునఁ
దనరారె వృషాద్రి యనఁగ ధరణీస్థలిలోన్.

109


క.

అనిమిషులు సమ్ముదంబునఁ
గనునప్పుడు స్వర్ణమయముగా నగ్గిరి యు
ర్విని వెలయ దానికిం దగెఁ
గనకాచల మనఁగ మౌనిఘనులార యొగిన్.

110


క.

నారాయణుఁ డనువిప్రుం
డారూఢిగఁ దప మొనర్చి హరి మెప్పించెన్
ధారుణిఁ దత్కారణమున
నారాయణశైల మనఁగ నామం బలరెన్.

111


క.

ఆవైకుంఠపురంబునఁ
బావన మైయుండుదాని పక్షీంద్రుఁడు తేఁ
గా వచ్చిన కారణమున
శ్రీవైకుంఠాద్రి యనఁగఁ జెలువారె మహిన్.

112


క.

నరసింహుం డాదైత్యుని
నురుకోపముతోడఁ జంపి యొగిఁ బ్రహ్లాదుం