పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తా నందు మేల్కని తనకుక్షిలో విశ్వ
        మును దాఁచికొనియుండి వనజభవుఁడు
నిద్ర మేల్కొనఁగానె నిఖిలకారణకార్య
        యుక్తసృష్టిని వాని కొప్పగించు
రమణమై మీనవరాహాదిరూపంబు
        లటువంటికాలంబులందుఁ దాల్చు


తే.

దుష్టనిగ్రహ మొనరించి శిష్టజనుల
రక్షణము సేయు నొక్కవరాహకల్ప
మందుఁ జక్రికి మ్రొక్కి పద్మాసనుండు
వినయ ముప్పొంగ నిట్లని విన్నవించె.

99


ఉ.

శ్వేతవరాహరూప ననుఁ జేకొని విన్నప మాలకించి యీ
భూతలమందు శేషగిరి పూజితమై తగు నందు మీరు వి
ఖ్యాతిగ నిల్చితేని మిము గాంచి తరింతురు మర్త్యులంద ఱో
తాత యటంచుఁ బల్కఁగ విధాతను జూచి ప్రసన్నచిత్తుఁడై.

100


తే.

చక్రి యిట్టులనియె జలజసంభవ నీవు
కోరినట్ల యేను గ్రోడరూప
ధరుఁడ నగుచు శేషధాత్రీధరమునందు
నిలిచియుందు ననియె నెమ్మిమీఱ.

101


తే.

అనిన విని మ్రొక్క సనియెఁ బద్మాసనుండు
శ్వేతకిటితన్నిమిత్తంబుచేత శేష
శిఖరియందు నివాసంబు చేసి జనుల
రక్షణము సేయుచుండు నిరంతరంబు.

102


ఆ.

ఆవికుంఠమున సదాదిత్యమండల
మందు సర్గమందు హరి వసించు