పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

333


గావించిరి, హరి వచ్చి కుశలప్రశ్నంబు లడిగి యనంతర మంద
ఱం జూచి హరి యిట్లనియె.

103


సీ.

ఇంద్రాదులార నే నీకలియుగమందు
        నాకాశపతిపుత్రి నాత్మ వలచి
యఱమఱలే కుద్వహంబాడువాఁడ మీ
        కిది యిష్ట మేగద యెలమి ననుచు
నడుగఁగ వారంద ఱబ్జాక్షు నీక్షించి
        పరమసంతోషసంభరితు లగుచు
శ్రీకాంత మిక్కార్య మీకలియుగమున
        నడుపుట యిష్టంబ గడుముదంబ


తే.

యనఁగ హరి యప్పు డింద్రుని కనియె నీవు
మయుని రావించి యిపుడు రమ్యంబు గాను
భూరిభవనము నిర్మింప పోయి గగన
రాజు గల పురియందు నిర్ణయముగాను.

104


వ.

అనిన నయ్యింద్రుండు మయునిం దోడ్కొనివోయి మణి
మయాలంకృతకుడ్యకవాటకూటంబులును శృంగాటకమందిరం
బులు, నింద్రనీలజాలకశయ్యాగృహంబులును, చంద్రకాంతో
పలసౌధంబులును, వివిధవిచిత్రరచితసభామంటపంబులును,
రమణీయకమలకల్హారషండసంకలితశీతలవారిపూరితకాసార
తీరరసాలసాలవకుళమాలూరాద్యనేకమహిజసందోహపరి
వృతవిరాజితం బై యొప్పు నవ్యపురంబును హర్మ్యంబును
నిర్మింపఁజేసి యిద్దఱు వేంకటాద్రికి విచ్చేసిరి. అనంతర
మాహరి, పిలుఁవదగినవారలం బిలుచుటకు షణ్ముఖు
నకును, బ్రత్యుత్థానాదికృత్యంబు లాచరించుటకు మన్మథు