పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


లక్ష్మి కొల్లాపురిచేరిన చరిత్రంబును దాఁబడిన చిక్కుపాట్లను
నుడివి వరాహదేవుండు దనకు నుండుటకు నెడనొసంగి
నదియుం జెప్పుచుండు సమయంబున.

101


సీ.

శేషుండు కైలాసశిఖరికిం జని చంద్ర
        శేఖరునకు శుభరేఖ నిచ్చె
నది చూచి శంభుఁ డయ్యద్రికుమారిత
        ప్రమథగణంబులు బాగుగాను
వినఁగఁ బఠింపఁగ వేడ్కజెందిరి వారు
        శివుఁ డంతఁ బార్వతిం జెంతఁ బిల్చి
తమకుండు దివ్యవస్త్రాదిభూషణములు
        దాల్చు మటంచును దాను బ్రమథ


తే.

గణములను గూడి వృషతురంగంబు నెక్కి
వివిధవాద్యరవంబులు వేడ్కఁ జెలగ
విఘ్నపతి ముందు నడువ నుర్వీతలానఁ
దనరుచుండెడు శేషాద్రి దాఁపుఁ జేరి.

102


వ.

వచ్చుచుండుటం జూచి శ్రీహరి లేచి యచటి యజునితోడం
గూడి యెదురేగినం జూచి శివుండు నందిని డిగ్గి నమస్కరించె
నాహరి రుద్రు నాలింగనం బొనరిచి తోడ్కొనివచ్చి మణి
మయాసనాసీనుం జేసి తనవృత్తాంతం బంతయు నెఱింగించె
నంతఁ దమతమకళత్రపుత్రమిత్రబంధుజనసమేతులై
యింద్రాదులు సని హరిహరబ్రహ్మలకు నమస్కరింప వార
లాశీర్వదించి నంత శ్రీహరి శేషగరుడులం బిలిచి యింద్రాదు
లను నుచితాసనాసీనులం జేయుఁడని నియమింప వా రట్లు