పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నకు, పరిపక్వరుచిరాన్నాదులు చేయుటకుఁ బావకునకు, జలం
బులఁ దెచ్చి యిచ్చుటకు వరుణునకు, జందనపుష్పాదులొసంగు
టకు గంధవాహనునకు, ధనదానంబు సేయుటకుఁ గుబేరునకు,
దీపప్రకాశంబు సేయుటకుఁ జంద్రునకు, వలసినపాత్రలు
దెచ్చి యిచ్చుటకును దండించుటకును దండధరునకు, నియ
మించె. నంత వసిష్ఠుండు వరాహస్వామి సాన్నిధ్యంబున
యజుశ్శాఖోక్తప్రకారంబున గృహయజ్ఞప్రయత్నంబు
సేయించె. నంతం బద్మభవుఁడు వివాహపీఠి నిర్మించి యందు
బార్వతీప్రముఖసువాసినులచేత సంపెంగతైలాదిమంగళ
ద్రవ్యంబులును బంగరుపళ్ళెరంబునఁ దెప్పించి యందుంచి
హరిం జూచి యభ్యంగనస్నానాదు లొనర్చికొని పుణ్యాహ
వాచనంబును గులదేవతాప్రార్థనంబును జేయవలయు నతి
శీఘ్రంబుగ రమ్మని చెప్పిన, హరి చింతాక్రాంతుండై బ్రహ్మ
కిట్లనియె.

105


క.

విను పద్మజ కొల్లాపుర
మున శ్రీసతి యున్న దిపుడు ముచ్చటగా న
వ్వనజాలయ లేనిది నా
మనసొప్పదు స్నానమునకు మఱి చింత యగున్.

106


తే.

కారణం బిట్టు లుండఁగఁ గార్య మటులఁ
బట్ట నేటికి సిరి యల్గి పోయె నిపుడు
ప్రీతితో నట్టిసతి లేక పెండ్లియాడఁ
దగదు తగదంచు లక్ష్మిని తలఁచి తలఁచి.

107


సీ.

హరి చింతపడఁగ నయ్యబ్జగర్భాదులు
        బదులు సెప్పఁగలేక కొదుకుచుండ