పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

325


తే.

సకలబంధుజనంబులు సకలమిత్ర
జనము లెల్లరు హర్షింప మనసునందుఁ
బొంగుచును భార్యయును వేడ్కఁ బొందఁగాను
బ్రాకటంబుగ బంగరుఱేకుమీఁద.

79


వ.

వకుళమాలిక సంతసింప నివ్విధంబున వ్రాయించె.

80


సీ.

శ్రీమదఖండలక్ష్మీప్రసన్నేక్షణా
        లంకృతులై సదుల్లాసు లైన
యఖిలాండకోటిబ్రహ్మాండనాయకు లైన
        సర్వజ్ఞులైన శ్రీ స్వామివారి
కాకాశనృపుఁ డాయురారోగ్యపుత్రపౌ
        త్రాభివృద్ధులు గల్గునట్లుగాను
దీవించితిని మఱిదినమునఁ గుశలంబు
        మారు మీకుశలంబు మఱువకుండ


తే.

వ్రాయుచుండఁగవలయు నావ్యాససుతుఁడు
గురుఁడు చెప్పఁగ మీకు నాకూఁతురైన
పద్మ నిచ్చి వివాహంబు బాగుగాను
జేయనెంచితి కరుణించు శ్రీనివాస.

81


వ.

అని వ్రాయించి హరిద్రాలేపనచిహ్నంబు సేయించి గురువుచే
నొసంగె. నతం డది చూచి శుకయోగీంద్రుని కరంబున నిడె,
నతండు గని యానందించుచుండ శ్రీనివాసున కీశుభపత్రిక
గొంపోయి యిచ్చి ప్రత్యుత్తరంబు దెచ్చుటకు యోగ్యులగు
వారు తామయనిగురుండు శుకునిం గని వల్క నది విని శుకుం
డట్ల కానిమ్మని యాలేఖఁ గొని వేంకటాచలారోహణంబు సేసి
వచ్చుచుండు శుకునిం గని శ్రీనివాసుం డెదురుసని ప్రియో