పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


క్తులం దోడ్కొనివచ్చి తింత్రిణీవృక్షమూలంబునఁ దానిర్మించి
యున్న పుష్పపీఠంబునందుఁ గూర్చుండఁబెట్టి యిట్లనియె.

82


క.

ఓ యోగీశ్వర సత్కృప
నీయెడ కిమ్మాడ్కివచ్చు టిది మేలయ్యెన్
మాయావిరహిత! నాపని
కాయో పండో నిజంబుగాఁ దెల్పుమయా.

83


క.

అనఁగను మందస్మితుఁడై
విని శుకయోగీంద్రుఁ డనియె విశ్వాత్మక నీ
ఘనచిత్తంబునఁ దలఁచిన
పని కాయని చెప్ప నేల పండై యుండన్.

84


చ.

అని శుకయోగి వల్క నపు డబ్జదళాక్షుఁడు సంతసించి య
మ్మునికి సమస్కరించి తనముచ్చటలెల్ల నొకింత చెప్పఁగా
విని ముదమంది తాపసుఁడు వేడ్కను దాఁ గొనివచ్చినట్టి శ్రీ
తనరెడు భవ్యరేఖను మదాసురవైరికరంబుఁ బెట్టఁగన్.

85


క.

అప్పుడు హరి యాపత్త్రిక
తప్పక తాఁ జదివి తెలిసి తడయక యపుడే
యొప్పుగ గేదఁగిఱేకున
గొప్పగ నిటు వ్రాసెఁ జేతిగోటం గ్రమమున్.

86


సీ.

అంత శ్రీశుకునకు నానంద మొదవంగ
        సరసిజనాభుండు చదివె నిట్లు
శ్రీపూర్ణరాజపూజితులైన ధర్మత
        త్పరసుధర్మ సుధర్మవరసుతులగు
సామ్రాజ్యకలితరాజశ్రీగగనరాజు
        వారికి శేషాద్రివల్లభుండు