పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

శ్రీవేంకటాచలమాహత్మ్యము


క.

లోకం బంతయు మూయను
మూఁకుఁడు లే దతని నేల మోహించితివే
కూఁతుర మాకును నీకును
బ్రాకటఋణ మింతె కీర్తి రాఁగలదె మహిన్.

50


సీ.

అని యిట్టు వలుకఁగ నపుడు పద్మావతి
        హరి పూర్వవృత్తాంత మాత్మయందుఁ
దలఁచి యిట్లనియె నోతల్లి నీ కపకీర్తి
        వచ్చును ననుచింత వల దతండు
మనుజమాత్రుం డటంచు మదినెంచినావేమొ
        మనుజుండు గాఁడు రమావిభుండు
పురుషోత్తముండు సంపూర్ణప్రకాశుండు
        సర్వజ్ఞుఁ డాఢ్యుండు శాశ్వతుండు


తే.

గాన నాస్వామియందు నామానసంబు
కుదిరి నిలిచిన దది నాకుఁ గొదువ గాదు
నాకొఱకు భూమి నపకీర్తి మీకు లేదు
కావలసినట్టిపను లింకఁ గాక వోదు.

51


వ.

వినుము జననీమతల్లి చింతమాను మే మహామహుని దివ్య
చక్రంబు కౌరవబలంబులం ద్రుంచి కరినగరంబున ధర్మరా
జును పట్టభద్రుంజేసి తత్పురసంరక్షణంబు సేయుచుండు,
నేమహాత్ముని శంఖారావంబు దైత్యబృందంబునకు భయ .
ప్రదంబై దేవతల కానందంబు నిచ్చుచుండు నట్టి శంఖ
చక్రధరుం డైన పరమపుర్షుండు లీలామానుషవిగ్రహుండు
నై నిన్న నవ్వనంబున నాకుంగాక చెలులకుంగూడ దర్శనం
బిచ్చినవాఁడు నే నీమర్త్యలోకంబున నుండఁదగినరీతి కాతని