పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

317


యందు ఱాల రువ్వించితి నయ్యపచారం బేను జేసినందుల కమ్మ
హావిష్ణుండు నన్ను రక్షించునో రక్షింపఁడో యనుసందియం
బును భయంబును బెనఁగొని కన్నీరునించుటయకాని కౌమ
వికారవ్యాపారంబు నాకింత కేల శ్రీనివాసుని దివ్యమంగళ
రూపంబు నాకు నగుపడకుండినచో నుసురులఁ దొఱంగెదఁ
బ్రత్యక్షం బైనఁ బ్రాణంబు లుంచుకొనెదనని పూలపాన్పు
నందు వ్రాలుటంచేసి చూచి ధరణీదేవి యచ్చెరువంది
యిట్లనియె.

52


సీ.

అమ్మ పద్మానతీ హరిభక్తి నీచిత్త
        మం దింతగా నిల్పినందువలన
నీకోర్కె సిద్ధించు శోకింప వల దింక
        నాచక్రి నినుఁ బెండ్లియాడు ననుచు
దేటగ నొకధర్మదేవత వచ్చి నా
        కెఱుఁగఁజెప్పినమాట లేలదప్పు
దప్ప దిప్పుడు నీవు ధైర్యంబుతో నుండు
        మని చెప్పుచుండఁగా నంత నటకుఁ


తే.

గ్రమముగా విప్రముఖ్యు లగస్త్యు లింగ
మునకు రుద్రాభిషేకంబు దనరఁజేసి
పరఁగఁ దత్తీర్థమును బూలు పత్త్రి పండ్లు
కోరి గైకొని రాఁజూచి వారితోడ.

53


తే.

చెలులతోఁ గూడి గుడినుండి చెలిమి దనర
వకుళమాలిక పల్కుచు వచ్చె నపుడు
ద్విజులు రుద్రాభిషేకసత్తీర్థ మమరఁ
జల్లి పద్మావతిశిరంబు నుల్లసముగ.

54