పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

295


తే.

తప్ప కిప్పుడ పెండ్లి పెత్తనము చేయఁ
బోయి రమ్మని పల్క నాపొలఁతి హరిని
గాంచి పుత్రక యిప్పు డాకన్యయున్న
దివ్యపుర మెట్టిదో దారి డెల్పుమయ్య.

342


తే.

అనఁగ హరి యిట్టులనియె నీయద్రిదిగువ
నమరు నమరావతీపురం బనఁగఁ బుడమి
నున్నతంబై ప్రకాశించు నొక్కనగర
మట్టి పట్టణ మిపుడు నీ వెట్టి దనిన.

343


సీ.

వేదవేదాంగప్రవీణులై వేదాంత
        వేత్తలై వెలసిన విప్రవరులు
ప్రవరబాహాశౌర్యపటిమజితారాతి
        వారంబు గల భూమివరమణులును
మణికాంచనోజ్జ్వలమందిరాంగణసట
        ధ్వజమందిరులు నైన వైశ్యవరులు
ధరనిర్జరులపాదసరసిజసేవ్యైక
        శుభధురంధరు లైన శూద్రఘనులు


తే.

గలిగి విలసిల్లు గోపురకలితలలిత
రత్నకాంతపరిభ్రాంతి రాజహంస
పథనిరోధకసాలవిభ్రాజమాన
మై ప్రకాశించు నారాయణాఖ్యపురము.

344


ఉ.

అప్పురమేలువాఁడు గగనాఖ్యధరాపతిచంద్రుఁ డుత్తముం
డెప్పుడు ధార్మికుం డతఁ డభీష్టసుఖప్రదుఁ డంచు సజ్జనుల్
మెప్పుగ నెన్నుచంద్రు కడుమేలుగ భక్తి విరక్తి యుక్తులం
దొప్పినవాఁడు దేవతచయోన్నతి సన్నుతిఁ జేయ నొప్పెడున్.

345