పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

సప్తాంగములవెలి సవరించి యాత్మయం
        దష్టాంగసరణిపై నాసఁ బెంచి
బైటశాత్రవకోటపటిమంబు నిర్జించి
        యంతర్విరోధుల నడఁగఁజేసి
బాహ్యపుణ్యనదీప్రభావంబు నీక్షించి
        యాంతరనదులపై నాత్మ నుంచి
వెలుపలిచక్రము ల్వేడ్కతోఁ బాలించి
        సొరిదిలో చక్రముల్ చూడ నెంచి


తే.

దీనజనమానసాధీనధీరు విష్ణు
చరణకంజాతసంజాతసారమధుక
రాయమానమనస్కుఁడై రహిని వెలయు
నెమ్మి మీరంగ నాకాశనృపవరుండు.

346


తే.

తొండమానుండు ముద్దుతమ్ముండు పరమ
భక్తియుక్తుండు శాంతుండు పరఁగఁ బుత్త్ర
కుండు వసుధానుఁ డని భార్య యోగ్యశీల
ధరణిదేవీయనంగ పద్మావతి సుత.

347


చ.

అని గగనక్షితీశ్వరుని యభ్యుదయంబును జక్రి చెప్ఁపగా
విని వకుళాంగనామణి వివేకము మీరఁగ నద్రి డిగ్గి యో
వనజదళాక్ష మార్గమిఁక వారకచూపుమటంచుఁ బల్క నే
మ్మనమునఁ జూపు దేను వినుమాత కృపాన్విత ధర్మపాలితా.

348


వ.

ఇప్పర్వతంబు డిగివోవ నచ్చట పావనకపిలతీర్థం బొండు
గలదు. అద్దానియందు మునింగి కపిలమునివలనఁ బూజ
లందఁబడిన శివలింగంబునకు నమస్కారంబు లిడి శ్రీనివాసు
నకు నతిశీఘ్రంబుగ వివాహలగ్నము సమకూర్చు మని విను