పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

275


భూరమణాత్మపుత్త్రి ననుఁ బొందఁగఁ జేసితిరేని మీకు నేఁ
గూరిమి నిచ్చెదన్ ముదము గోరినవన్నియు నిశ్చయంబుగన్.

266


సీ.

అని చక్రి మఱల నిట్లనియె మాకులము శీ
        తాంశుకులంబు వసిష్ఠగోత్ర
మగు తండ్రి వసుదేవుఁ డాదేవకే తల్లి
        యగు హలపాణి మాయన్నగారు
లలితురా లైనచెల్లెలు సుభద్రాదేవి
        పావనుం డైనగాండీవి మఱఁది
ధర్మరాజాదులు దగు బంధుజను లన్న
        తెఱవలు నగుచు నీ దేహమెల్ల


తే.

నలుపిదే మన్న వెన్నుండు నగుచుఁ బలికె
గృష్ణపక్షము నడిరేయి గినిసి కూడి
నపుడు పుట్టితి గనుక దేహంబు నీల
మయ్యె నందున ననుఁ గృష్ణుఁ డనిరి బుధులు.

267


క.

నాకులగోత్రము లిప్పుడు
మీ కెఱిఁగించితిని గనుక మెండొడ్డక మీ
రీకన్య కులము గోత్రము
నా కొనరఁగఁ జెప్పుడనఁగ నగి చెలు లెల్లన్.

268


తే.

అనిరి చంద్రకులంబును నత్రిగోత్ర
జనితుఁ డాకాశరాజను జనవిభునకుఁ
బుత్త్రికామణియై పుట్టి భూతలానఁ
బెరిగి పద్మావతీ యనం బరఁగె వినుము.

269


తే.

మేటియై మము నొగిఁ జిన్ననాఁటనుండి
యొరియ మాతోడ నాటాడుచుండు మాకు