పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


త్తరుణి వచింపఁగా నపుడు ధైర్యముతో హరి గాంచి నవ్వుచున్.

262


క.

ఆపద్మావతి కడ్డుగ
నాపొలఁతులు నిలిచి హరికి నగుపడకుండం
భ్రాపించి కోపమున నా
శ్రీపతి నీక్షించి చాలఁ జిడిముడి వడుచున్.

263


సీ.

పలికి రిట్లని రాచపట్టి యిందుండఁగఁ
        బరుఁడ వొక్కింతను భయము లేక
వచ్చితి విప్పు డావల కేగుమంచును
        దఱుముచు రాగ నాదైత్యరిపుఁడు
నగవుతో నిట్లనె నలినాక్షులార మీ
        రాజపుత్త్రిని జూచి రహిఁ జెలంగ
మాటాడ వచ్చితి మాటలాడక మీరు
        పొండన నా రాజపుత్త్రిఁ గాంచి


తే.

చెలులతో ననె నతఁడు మిమ్ములికిపడఁగఁ
బలుకుచున్నాఁడు శబరుండు పాపమేమి
వీనిబందువు లెవ్వరో వీఁ డెవండొ
వీనికులగోత్రములు నేవొ విశదముగను.

264


తే.

అడుగుఁడని రాజసుత పల్క నపుడు చెలులు
చక్రధరుదిక్కుఁ దిరిగి యోశబర నీకుఁ
దల్లిదండ్రులు పేళ్లేమి దగ కులంబు
గోత్రమును చెప్పుమనఁగ వైకుంఠుఁ డపుడు.

265


ఉ.

వారిని జూచి యిట్లనియె వారిజలోచనలార యిచ్చటం
గూరిమిమీర నాకులము గోత్రము లెల్లను జెప్పు దేను మీ