పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సకలవస్తువు లిప్పించు సఖ్య మెసఁగ
నెపుడు నీయమ్మ సదయ మమ్మేలుచుండు.

270


చ.

అన విని వెన్నుఁ డిట్లనియె నంబుజలోచనలార మిమ్ము నె
ల్లను గృప నేలుచున్న కమలాక్షిని సఖ్యము సేయ వచ్చితిన్
ఘనముగ నన్నుఁ గూడుమని గన్గొని మీదొరపట్టి కిప్పుడే
మన మలరంగఁ జెప్పుఁ డనుమానము లేక యటంచుఁ బల్కఁగన్.

271


క.

విని పద్మావతి కోపం
బునఁ జెలులం బిలిచి దిట్టి పొమ్మను వానిన్
ఘనత నెఱుంగక యున్నాఁ
డని తాఁ బొమ్మనియె దూర మరుగు మటంచున్.

272


సీ.

అనిన వెన్నుం డిట్టు లనియె నోలలితాంగి
        నిష్ఠురం బేలనే నీకు నాకు
మార్దవంబుగ మేటిమాటల నాడుము
        చెలఁగి కన్యాపేక్ష గలిగి యిటకు
వచ్చితి నను నీవు వరియించుటకుఁ దగు
        పాత్రుఁడనేగాని బరుఁడఁ గాను
బాత్రదానము సేయు ప్రభువుకు నిహపర
        సౌఖ్యము ల్గల్గు నీజనకుఁ డెలమి


తే.

నన్నుఁ గాంచినయప్పుడ నిన్ను నాకు
నీయఁగోరును సందియం బేమి లేదు
చంద్రకులజుండ వేఱవంశజుఁడఁ గాను
నన్నుఁ జేరుము సరవి ననంగ నపుడు.

273


క.

నీవు నిషాదుఁడ వయ్యును
వావిరి ఘనచంద్రకులమువాఁడ నటంచున్