పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


జని తనమందిరంబునకు సంతస మారఁగఁ బోయి భార్యచే
నొనరఁగ నిచ్చి చెప్పి బహుళోత్సవము ల్నడిపించి యిట్లనెన్.

214


తే.

విను మయోనిజ యైనట్టితనయ నపుడు
నీకు దేవుఁడు దయనిచ్చె నెమ్మి నెగడ
బాగుగం బోషణము సేయు పడఁతి నీవు
పుత్త్రచింత యిఁ కేల పో భూతలమున.

215


క.

తద్దయు నాతలిదండ్రులు
ముద్దాఱఁగఁ బెంచుచున్న మురిపెము దనరన్
ముద్దులు సూపుచు జిలిబిలి
సుద్దులు చెప్పుచును వేడ్కఁ జూపుచునుండెన్.

216


సీ.

ఆకన్య తమయింటి కరుదుగ వచ్చిన
        ఘనలక్షణమున నాకాశరాజు
భార్య గర్భము దాల్చెఁ బరమముదంబున
        నైదవనెలను శుభావహముగ
సీమంత మారాజు సేయించె నటుమీఁదఁ
        బొలుపొంద నవమాసములు నెసంగె
దశమమాసంబునఁ దరణి కన్యారాశి
        యందుఁ బ్రవేశించినపుడు శుక్ల


తే.

పక్షదశమియు రోహిణి భార్గవాస
రంబు సాయంసమయమున రాజుగారి
కెలమి పుత్త్రుండు పుట్టె భూతలమునందు
జనులు వొగడంగ నానాఁడు సౌఖ్యముగను.

217


వ.

అప్పు డారాజేంద్రుడు సంతోషమగ్నుండై స్నానం బాచ
రించి బ్రాహ్మణులకు నవధాన్యాదులు దానంబు లొసంగి నిజ