పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

261


గురుపూజచేసి సుతునకు వసుధానుం డని నామకరణం
బొనర్చి సుతకు బద్మావతి యని పేరెడి యందఱకు మృష్టా
న్నంబు పెట్టించి పుత్రీపుత్త్రకుల నత్యంతప్రియంబునఁ బెంచు
చుండఁగ దినదిన ప్రవృద్ధమానులై క్షీరసాగరాజమందిర
మధ్యంబునం లక్ష్మియుఁ జంద్రు లుండినయట్ల రాజుగారి
సుందరమందిరంబునం బ్రకాశించుచుండి రంత నారాజు
కొన్నాళ్ల కయ్యిద్దఱకు విద్యాభ్యాసం బొనరించి యనంతరము
పుత్త్రునకు నుపనయనంబు చేసి పద్మావతికిం దగినవరుని వెద
కుచు గురువుకు సమస్కరించి యిట్లనియె.

218


సీ.

పుణ్యాత్మ గురుచంద్ర పుత్రకామేష్టి మీ
        యనుమతిఁ జేసెద మనుచు నేను
భూమి దున్నింపగ భూమియం దొకపద్మ
        ము లభించె నందున లలిత మెఱుపు
బాలిక దొరకఁగఁ బద్మావతీ యని
        పేరు శాస్త్రమురీతిఁ బెట్టి యిపుడు
పెంచుచున్నాము తా మంచితగుణవర్యు
        నాకన్యకకుఁ దగినట్టి వరుని


తే.

గని వివాహంబు సేయంగ మనమునందు
నెంచియున్నాఁడ నెందైన నెఱిఁగియున్న
జెప్పుఁ డన నాగురుండు నీకొప్పుగాను
దగినయల్లుఁడ వచ్చు సిద్ధం బటంచు.

219


మ.

అని యాదేశికుఁ డానలిచ్చి చనె నం దారాజు పద్మావతిం
గని సంతోషనిమగ్నుఁడై మురియుచున్ గారాబుగాఁ బల్కుచున్