పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

259


యుక్తులై యుండి. రందు నాకాశరాజేంద్రునకు సంతానంబు
లేమిం జేసి చింతించుచు బృహస్పతికి నమస్కరించి యిట్లనియె.

210


సీ.

సద్గురువర నాకు సంతానభాగ్యంబు
        గలుగకుండుట కేమి కారణంబు
చెప్ప వేఁడె దటంచు నొప్పుగఁ గొనియాడ
        నతఁ డిట్టులనియె నాక్షతిభవునకు
నీవు పాపము లెన్ని గావించియుండిన
        పరిహారమగుట కుపాయ మొండు
చెప్పెద నెట్లన్నఁ జెలఁగ భక్తిని బుత్త్ర
        కామేష్టి గావింపు క్రమము మెఱసి


తే.

సుతులు పుట్టెదరని ధర్మహితము దనరఁ
బల్కఁగా విని మ్రొక్కి భూపాలుఁ డచటఁ
జెలఁగి యజ్ఞప్రయత్నము ల్జేసి దనరఁ
హలమున న్భూమి దున్నించె నతిముదమున.

211


చ.

అటు ధర నప్డు దున్నఁగ సహస్రదళంబులు గల్గి యొప్పువి
స్ఫుటతరపద్మ మందుఁ బొడసూపినఁ జూచి నృపాలకుండు నేఁ
డిటువలె నబ్జ మీధరణి నెట్లు జనించె నటంచుఁ జూడఁ ద
త్పటుతరకంజమధ్యమున బాలిక గన్పడె నద్భుతంబుగన్.

212


ఉ.

అప్పుడు దానిఁ జూచి నృపుఁ డార్యుల నెల్లరఁ బిల్చి భక్తిమై
నొప్పుగఁ బద్మమధ్యమున నుండెడుకన్యను మెచ్చి వారికిం
దప్పక చూపుచుండఁగ ముదంబున నం దశరీరి యిట్లనెన్
మెప్పుగ దీని బెంపు మిఁక మేలు ఘటించును నీకు భూవరా.

213


చ.

అని యశరీరి వల్కఁ గని యచ్చెరువంది నృపాలకుండు మె
ల్లనఁ గమలస్థకన్యకను లాలనఁ జేయుచు గారవించుచున్