పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మారున కిచ్చి, హరిభక్తుఁడ వై చక్రవర్తి వై సత్యవ్రతుండ
వై యుండుమని చెప్పి ముద్దిడి నాగలోకంబునకుం జనియె.
నబ్బాలకుండు నారాయణవనపురంబుం జేరి సుధర్మరాజు సమీ
పంబున కేగి మ్రొక్కఁగ నయ్యర్భకశ్రేష్ఠుని జూచి నృపాలు
డట్లనియె.

208


సీ.

ముద్దుబాలక నాకు మ్రొక్కి నిల్చితివి నీ
        వెవఁడవు తలిదండ్ర లెవరు చెపుమ
యుగ నాడింభకుం డళుకింత లేకుండ
        నరనాథ నాతల్లి నాగకన్య
తండ్రి సుధర్మభూధవుఁడు శ్రీకీర్తివి
        ఖ్యాతుఁ డటంచు నుంగర మొసంగ
నాముద్రికను జూచి యతఁడు మంత్రిపురోహి
        తాత్మబంధుజనమిత్రాదులకును


తే.

నందనుని జూపి మును దాను నాగకన్యఁ
గలసి యుంగర మిచ్చినకారణంబు
పరఁగఁ జెప్ప కుమారుని బట్టి తొడల
మీఁదఁ గూర్చుండ నిడుకొని మెచ్చికొనుచు.

209


వ.

తొండమానుండని నామం బిడి యుపనయనవివాహాదులం జేసె.
నంత నాసుధర్మరాజేంద్రుండు పుత్త్రు లగునాకాశరాజుకుఁ
బట్టంబు గట్టి నాగకన్యకయందుఁగనిన తొండమానుని యువ
రాజుం జేసె. నంత కొంతకాలంబునకు నాసుధర్ముండు దివంబునకు
నేగె. కుమారు లాతండ్రి మరణంబునకు దుఃఖసాగరంబున
నోలలాడుచుఁ గ్రియలు నిర్వర్తించి యిర్వు రేకోదరులచందం
బున నత్యంతమైత్రి గలవారై నారాయణనామపారాయణ