పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

చతుర్థాశ్వాసము


తే.

గొలువుఁ డని పార్షదులకు వైకుంఠపురముఁ
బాయకుండుఁడు నిరతంబు పటిమ విడక
చెప్పి భూనీళలకు వారి నొప్పగించి
మఱల నిట్లని తలఁచె నమ్మాధవుండు.

139


వ.

కొంతకాలం బట్లుండిన నయ్యిందరను ముద్వక్షంబునం దుంచు
కొందు నని నిశ్చయించి భూనీళలం జూచి బుజ్జగించి రమా
దేవిని వెదకి గ్రమ్మఱఁ దోడ్కొనివత్తునని వారితోఁ జెప్పి
వైకుంఠంబు విడిచి వేంకటాద్రికి వచ్చె ననఁగ శౌనకాదు లిట్లనిరి.

140


క.

శ్రీవనితామణి నరయుచు
శ్రీవైకుంఠంబు విడిచి క్షితిపై నుండెన్
శ్రీవేంకటగిరిఁ జేరిన
శ్రీవిష్ణుం డచట నేమి సేయుచునుండెన్.

141


సీ.

అని మును లడుగంగ నాసూతుఁ డిట్లనె
        వినుఁ డాదివిష్ణుండు వేంకటాద్రిఁ
జేరి యచ్చటనుండు శ్రీవరాహస్వామి
        కిని పుష్కరిణికి దక్షిణముగాను
విలసిల్లు తింత్రిణీవృక్షమూలమునందు
        మెఱయుచున్నట్టి వల్మీకవిరివి
యందుఁ బ్రవేశించి యయుతవత్సరములం
        దెవరికిం గన్పింప కెలమిగాను


తే.

బుట్టలో వెల్గుచుండఁగ భూతలమునఁ
దప్ప కిరువదియెనిమిది ద్వాపరాంత
మందుఁ గలియుగ ముదయించె నపుడు చోళ
రాజు భువి నేలుచుండె ధర్మంబు దనర.

142