పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అట్టికాలంబునఁ బర్జన్యుఁడు కాలవృష్టి గురియించుచుండ
భూమి సమృద్ధంబుగ సస్యాభివృద్ధి నొసంగుచు గోవులు బహు
క్షీరంబు లిచ్చుచుండు, పతివ్రతాంగనామణులును సతీవ్రతు
లగుపుర్షులును, మాతాపితృగురుదైవభక్తి గలపుత్త్రు
లును గల్గియుండుదు రట్టి యుగాదికాలంబునఁ గొల్లాపురిం
జేరిన లక్ష్మి, శ్రీహరి వైకుంఠంబు విడిచి శేషాచలంబునందుఁ
దింత్రిణీతరుమూలస్థలవల్మీకంబునందు వసించియుండుచందంబు
భావించి తెలిసి తనమనంబున నిట్లు వితర్కించె.

143


క.

నాకొఱ కంబుజనాభుడు
వైకుంఠము విడిచి వచ్చి వల్మీకములో
నేకాకి యగుచు నం దిపు
డాకొనినాఁ డేమి సేయు దకటా యంచున్.

144


క.

చింతించుచు నే నాహరి
చెంతం జేరినను నన్నుఁ జేకొను వైనం
బంతము విడువం దగదని
స్వాంతంబున నిశ్చయించి సరవిగ నంతన్.

145


తే.

వేగ కొల్లాపురంబును విడిచి గొల్ల
పొలఁతికైవడి నొంటిగఁ బోయి చోళ
రాజసతియున్న మణిమందిరంబుచెంతఁ
జేరి హరి కిఁక నెటు తృప్తిఁ జేతునంచు.

146


వ.

మనంబున దలంచుచున్న సమయంబున మహాలక్ష్మిభావం బజుం
డెఱింగి రుద్రుం దోడ్కొనివచ్చి యచ్చట ధేనురూపంబు
ధరించె నదెట్లనిన.

147