పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దేవుఁ డొక్కఁడు సమర్థింపలేఁ డాశ్రీని
        వాసుఁ డం దుండంగవలయుఁ గనుక
వసుదేవదశరథవరతేజములఁ ది్త్రి
        ణీవృక్షముగ దీర్చి నిలుపుదు నట


తే.

సరవి దేవకికళను గౌసల్యగళను
బుట్టఁగాఁ దీర్చియుంతు నాపుట్టలోన
శ్రీనివాసుండు వేగమ చే రుపాయ
మీవు గావింపు మెట్లైన దేవమౌని.

102


క.

వనజాక్షుం డాగిరిఁ జే
కనపిమ్మట హరికి నాఁటిరీతిని నరదం
బువ వేడ్క జేయవలె మే
లొనరంగ జగద్ధితంబు నొందఁగ మఱలన్.

103


సీ.

క్షితిమీఁద నెప్పుడు శ్రీనివాసుఁడు లేని
        కతన మానవులు దుష్కర్ము లగుచుఁఁ
గలిమాయ నొంది సత్కర్మముల్ శ్రద్ధతో
        జేయలే రిఁకమీద శేషగిరికి
మఱల శ్రీహరి వచ్చి మనుజులనెల్ల ర
        క్షింప నుసాయంబు సేయకున్న
జనుల పాపంబును శమనుండు గని నార
        కమునందుఁ ద్రోయించుఁ గాన భూత


తే.

దయ మనంబున నుంచి మాధవుఁడు శేష
పర్వతము చేరునట్టియుపాయ మీవు
సేయుమన విని సురమునిశ్రేష్ఠుఁ డలరి
యజునిపాదంబులకు మ్రొక్కి యాదరమున.

104