పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

225


కొప్పుగా నేలుమని చెప్పి యొప్పగించి
మంచిమాయానిగూఢవిమాన మెక్కి.

98


వ.

శ్రీభూనీళాసమేతుండై హరి వైకుంఠపురంబుం జేరి యందుండు
నిత్యముక్తులం జూచి యాచరించి యప్రాకృతమణిమయాంతః
పుకంబున శేషతల్పంబునందు వసియించియుండె. నంత శేషాద్రి
యం దుండు వరాహస్వామి విశ్వకర్మనిర్మితపురంబును నంత
ర్ధానం బొనరించి యిచ్ఛావిహారంబుగఁ బ్రవర్తించుచుండెఁ.
బిమ్మట వృషభాసురునితో యుద్ధంబు సేయం జనియె. నివ్విధం
బునం గొన్నియబ్దంబులు జరిగినవెనుక యొక్కనాఁడు నార
దుండు వేంకటాద్రికి వచ్చి శ్రీనివాసుఁడు వైకుంఠంబు చేరిన
వృత్తాంతంబు నెఱింగి సత్యలోకంబున కేగి బ్రహ్మదేవునకు నమ
స్కరించి యిట్లనియె.

99


తే.

తండ్రి విను చక్రశేషభూధరము శుభ్ర
ఘోణి కొప్పించి తాను వైకుంఠమునకుఁ
జేరె ననఁగా నజుం డతిచింత నొంది
యేమియుం దోఁప కతనితో నిట్టు లనియె.

100


క.

విను నారద భూలోకం
బున శేషాచలమునందుఁ బురుషోత్తముఁ డుం
డినకాలంబునఁ దద్భూ
జను లతిపుణ్యాత్ము లైరి సాత్వికు లగుచున్.

101


సీ.

ఆస్వామి వైకుంఠమందుఁ గ్రమ్మఱఁ జేరి
        నందుచే శ్రీవేంకటాద్రిమీఁద
నేను సంకల్పించి నెనరునఁ గావించి
        నట్టి రథోత్సవం బావరాహ