పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వృషభాద్రియని పేరొందు. నంత మునులు తమనెలవులనుండి
వచ్చి స్వామిని సన్నుతించుటం జేసి యద్దేవుండు వారియభీ
ష్టంబు లొసంగి తిరోధానంబు పొంది, భూదేవీసహితుండై
యిచ్ఛావిహారుండై యుండెనని చెప్పిన శతానందుని జూచి
జనకుం డిట్లనియె.

32


సీ.

మునినాథ వృషభాద్రి యనుదాని కంజనా
        చల మని పే రెట్లు గలిగెఁ జెపుము
యాశతానందుఁ డిట్లనియెఁ గేసరియను
        వనచరోత్తముభార్య తనకు సుతులు
గలుగకుండుటఁ జేసి తలంచి మతంగ ఋ
        షీశుని జూచి తా నిట్టులనియె
బుత్త్రహీనుల కెందుఁ బుణ్యగతు ల్మహి
        లేదంచుఁ దొల్తను వేదములను


తే.

జెప్పియుండుటచే నాకుఁ జిత్తమునను
భయము గదురుచు నున్నది దయను నాకుఁ
బుత్త్రుఁ డెట్లు లభించునో పుణ్యరూప
చెప్పుమని వేఁడ నమ్ముని యప్పుడనియె.

33


తే.

పొలఁతి యిచ్చటికిం బూర్వపు వలనొప్పు
నుర్విఁ జనఁ జన నేఁబదియోజనాల
దవ్వునం దనరారును ధాత్రి శ్రీనృ
సింహనామాశ్రమంబు శ్వశ్రేయదంబు.

34


వ.

తదాశ్రమంబుసకు యామ్యభాగంబునం బ్రకాశించుచున్న
నారాయణాద్రి ప్రదేశంబులం బరమపావనం బై యొప్పు
స్వామిపుష్కరిణికి నుత్తరంబుగఁ గ్రోశమాత్రదూరంబునం