పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

203


ననుఁ గూర్చి జగము మున్నొనరించుటం జేసి
        యింతకుఁ జంపక యెంచితిట్లు
గడపితిఁ గాలంబు గావున నింక నో
        పను నది యేలన వినుము విష్ణు
వును సృజించి యొనర్చుచున్న కార్యంబులు
        దెలిసె వాఁ డెం దేగె బలమడంగి


తే.

యింక నీ వెందు డాఁగెదో యెఱుఁగఁజేయు
చూడు నాశక్తి నేఁడు పెచ్చగను లేని
సోనిమాటలు వల్కకుఁ బూని శత్రు
భయదచక్రాన్ని కోపుదుష్పథరతుండ.

29


వ.

మఱియు నీశీర్షంబు చక్రాగ్ని కాహుతి యీకున్న నే
గరాళనృసింహుండను గానని.

30


తే.

కరమునం గ్రాలుచుండు చక్రంబుఁ జూపఁ
జూచి వృషభాసురుఁడు పరిశుద్ధమైన
భక్తి నానారసింహుని పాదయుగళ
మునను శరణాగతుం డయి వినుతిచేసి.

31


వ.

క్రమ్మర నిట్లనియె. దేవా! భవదీయచక్ర ప్రభావం బెంతని
వర్ణింప నాబ్రహ్మాదులచే నశక్యంబు గీర్తియు నంబరీషాది
రాజప్రముఖులకు విజయంబు లిచ్చినదఁట, యదియునుం గాక
భవచ్చక్రతప్తులైననవారలకుం బునర్జన్మంబులు రావఁట, కావున
నట్టియప్పరమచక్రంబులం దెగి ముక్తినొందెద మన్నామం
బీయద్రి కిడినం జాలునని ప్రార్థింప నానృసింహుఁ డారక్కసుని
నాలింగనంబుచేసి ముక్తినిచ్చి యప్పర్వతంబున కాయమర
వైరినామం బిడియె నక్కారణంబునం గృతయుగంబునందు