పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

205


దాకాశగంగాప్రవాహం బున్నయది నీ వందుఁ జేరి త్రికాల
స్నానంబు లాచరించుచు ద్వాదశాబ్దంబులు తపంబొనర్చు
చుండు మంత సుతుం డుదయించు ననిన మహాప్రసాదం బని
మ్రొక్కి యమ్మునినాథు నానతిచొప్పుఁ దప్పక నారాయణా
ద్రిం జేరి స్వామిపుష్కరణిం గ్రుంకులిడి తత్తీరాశ్వత్థవృక్షంబు
నకుఁ బ్రదక్షిణంబు లొనర్చి వరాహస్వామికి మ్రొక్కి
యందుండి యాకాశగంగకు నరిగి యందుండుమునివర్యులకు
నమస్కరించి వారియాశీర్వచనపూర్వకంబుగ నత్తీర్థంబునం
ద్రికాలస్నానంబులు సేయుచు నిరాహారంబున నొకసంవత్స
రంబు తపంబు సేసిన నంత వాయుదేవుండు ప్రసన్నుండై
ప్రతిదినంబు నొక్కొక్కమధురఫలం బొసంగుచుండ నది
భక్షించుచు నత్తపస్విని ద్వాదశవర్షంబులు పూర్తిగఁ దప
మాచరించె నంత నొక్కనాఁడు వాయుదేవుండు సద్వీర్యగర్భి
తంబైన ఫలం బియ్యంగ దానిన్ భుజించి యత్తరుణి గర్భంబు
ధరియించె ననంతరంబున.

35


తే.

అంత నాదేవిగర్భమం దనిలదేవుఁ
డొక్కనాఁడు ప్రవేశించుచుండునటుల
సంయమీంద్రుల కచ్చోట స్వప్న మయ్యె
నందుచే వారు నిస్సంశయాతు లైరి.

36


తే.

దశమమాసంబు నిండారెఁ దగ ధరిత్రి
నంజనాదేవిగర్భమం దనఘుఁడైన
పుత్త్రుఁ డుదయింపఁగాఁ జూచి పుష్పవృష్టి
సురలు గుఱియించి సంతోషభరితులైరి.

37