పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


గురుపాద జలముగ్రోలుట
గురుతర గంగోదకంబు గ్రోలుటగాదే
గురుసుప్రసాద సేవన
మరయ పురోడాశ భక్షణాతిశయమగున్ .43


గురునిర్ణయ విధమెఱుఁగక
గురుభక్తియు లేక మనసు గుదియింపని పా
మరుఁ డుపదేశంబొందిన
దొరకునె సన్ముక్తి యెన్ని త్రోవలనైనన్ .44

ఇట్లు గురు లక్షణస్థితి యెఱిఁగి యతని
వలన మోచకు ననుగాంచి లలితభక్తి
నన్ను భజియించెనేనియు నాదుకరుణ
విగతషడ్వర్గుఁడై ముక్తి విభవమొందు.45

ఎన్ని విధంబులనైనను
పన్నుగ కామాది శత్రుపంక్తిని విజయా
భ్యున్నతి నణఁచక మోక్షం
బెన్నటికిని గలుగనేర దేరికినైనన్.46

అని బోధించిన దక్షిణాస్యునకు సాష్టాంగంబు గావించి య
మ్మును లాత్మైక్య సమాధిఁజెంది యగరాణ్మూలస్థలిన్ నిల్చి "ర
య్యనఘాద్రీంద్ర మహత్వ మెన్నదరమే యాచక్రవాళావనిన్
ఘనతంగాంచు నగంబు లిగ్గిరి అసద్గండోపభాగంబులే.”47

అని చెప్పి శివుండు పార్వతికి మఱియు నిట్లనియె.48

ఉరు తదద్రి మాహాత్మ్య మటుండనిమ్ము
గుణవికారత మాని నిర్గుణ సమాధి