పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

47


గురుఁడె రుద్రుండు, విష్ణుండు; గురుఁడె యజుఁడు,
గురుఁడె పరమాత్మ యతనికిఁ బరుఁడులేఁడు.38

శివుఁడు గురురూపమై వచ్చి చెప్పకున్న
నిరత నిర్మల నిర్గుణ నిర్వికార
నిత్యపరిపూర్ణ తత్త్వంబె నేనటంచు
తెలియఁబడుటెట్లు గ్రంథముల్ దెలుపగలవె ?39

గురుబోధ లేనివారికిఁ
బరగ ననేకార్థశాస్త్ర పాఠవ్యసనం
బెఱుకను దొరకొనజేయునె ?
పరిపక్వము గానివాని భ్రాంతులుగాకన్ .40


మఱియు నీశ్వరానుగ్రహంబున పరిపూర్ణబోధంబు గల్గదేయనిన నీశ్వరుని నిజరూపం బెఱింగి భజించినంగాని పూర్ణానుగ్రహంబు గల్గదదిలేక ముక్తి లేదట్టి యీశ్వరు నిజరూపంబు సద్గురుప్రసాదంబునఁగాని తెలియఁబడ దట్లు తెలియక భజించుటవలన పుణ్యఫలంబెకాని యీజన్మంబునఁబూర్ణ బోధంబు కలుగ దట్లౌట నెన్ని విధంబులనైన గురూపదేశంబుచేఁగాని యీజన్మంబు నందె కేవల ముక్తి సంభవింప దట్టి గురుమూర్తిని చతుర్విధ శుశ్రూషల సేవింపని దేహాభిమానులకు ముక్తి లేదని వేదపురాణజాలంబులు పలుకు చుండునని చెప్పి వెండియు నిట్లనియె.41


గురుభజనమె హరభజనము
గురునిందయె హరునినింద గురుభక్తియె దా
హరభక్తియగును దలఁపఁగ
గురుహరులకు భేది మెద్ది కోవిదులారా :42