పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

49


బూని యేనందు దక్షిణామూర్తి నౌచు
వెస వసించితి నగ్గిరి విడువకుండు.49

ఇట్లు నివసించిన మద్రూపంబు సేవింప నా త్రికూటాచల కూటాధిపతులగు బ్రహ్మ విష్ణు రుద్రు లరుదెంచి దేవా ! నీవు చిదాకాశ రూపంబగు పరశివ తత్త్వంబవయ్యును ఘృత కాఠిన్యమూర్తియగు సదాశివు రూపంబుబొంది యిమ్మునుల కనుగ్రహింప నిపుడు దక్షిణామూర్తి లీల నంగీకరించి యిన్న గంబున నిరంతరంబు నుండఁదలంచుటవలన నేము నస్మచ్ఛిఖరాగ్రంబు లందు నిలిచి నిన్ను సేవింపు చుండెదము. నీవు ననేకకోటి బ్రహ్మాండంబుల కధీశుండవగుట కోటీశుండవని నిన్నఖిలలోకంబులుఁ బలుకుఁగాక యనిన నద్దేవుండు రానంగీకరించి వారల కిట్లనియె.50


మీకు నిలయంబులై కాంతి మెఱయుచున్న
మూఁడు శిఖరంబులందున మూఁడులింగ
రూపములనుందు, మీరు నిరూఢభక్తి
పూజ గావింపుఁ డానంద పూర్ణులగుచు,51

ఈమూఁడు లింగంబు లిహమందు మర్త్యుల
            కగపడకుండుట నవనిజనము
లా మూఁడు శిఖరంబులందున పటుశిలా
           రచితలింగంబు లేర్పఱచి భక్తిఁ
బూజించి యిహపరముల భోగమోక్షంబు
           లందంగ గల రనాయాసవృత్తి
నని సర్వగురుఁ డీశు డానతి యిచ్చిన
          నజ జనార్దన రుద్రు లాత్మ శిఖర

ములను నివసించి తల్లింగపూజనంబు
సేయుచున్నారు తన్మహాక్షేత్ర మహిమ
వేయి యుగములకైనను వేయినోళ్ళ
శేషఫణిరాజు కైనను జెప్పఁ దరమె.52