పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము



సభికులు దక్షభీతి నతిసల్పక యూరకయుండి రంత నా
సభగని దక్షసన్నిధికి సాగిన నాతఁడు బంధుకోటియున్
విభవ మెలర్పఁగాంచి యవివేకమునం బలుకాడరైరి య
య్యభవునితోడి వైరమున; నా సతి దక్షునిఁజూచి యిట్లనెన్. 114

తండ్రి మీయజ్ఞ మీక్షింపఁ దలఁచి నాదు
నాథు నెడఁబాసి వచ్చిన నన్నుఁజూచి
పలుక కుండుట యవివేక పథమటన్న
దక్షుఁడిట్లనె క్రోధ తామ్రాక్షుఁడగుచు. 115

తరుణి మాకు విరోధి నీధవుఁడతండు
ప్రేత భూత పిశాచ సత్ప్రియ సఖుండు
యజ్ఞభూమికి నరుదేర నర్హుఁడగునె
యతని సతివౌట నీవు ననర్హ విపుడు. 116

అన విని దక్షుని తోడుత
వనజేక్షణ పలికె నీదు వలన జనించెన్
తను విది దీని విసర్జన
మొనరించి హిమాద్రికేను బుట్టెద సుతనై. 117

అని యోగమార్గ సంజనిత వేగముతోడ
                హిమశైలమున కేగ ప్రమధులంత
కై లాసమునకేగి గరళ కంధరు జూచి
                యీ వార్త దెలుప న య్యీశ్వరుండు
చటు లోగ్ర కోప సంఘటిత భ్రుకుటితోడ
               వికటాట్టహాసుఁడై వీరరౌద్ర
రస సముద్ధతి మేన బొసఁగ ఘర్మాంబువుల్‌
               తనచేతఁబట్టి యుద్ధతి విశాల