పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

118

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము




మఱలి చూచుట యెఱిగి య మ్మౌనివరుఁడు
తరుణి కిట్లనె నియమంబుఁ దప్పి తీవు
నేను భూమికి దిగిరాను మాని తాజ
శిఖర మధ్యస్థబిలమున జేరినిలుతు. 147

అనుచు ముని పల్క నయ్యింతి యచటనిల్చి
ప్రసవకాలంబు దోఁచినఁ బడసె సుతుని
యది నిరీక్షించి మౌని య య్యద్రి బిలము
జేరి యందు సమాధి నేఁ జేతు ననియె. 148

ఆ మాట విని యింతి, యతనితో నిట్లను
             దద్బ్రహ్మకూట మధ్యస్థ బిలము
లోన సమాధిని బూని నీవుండిన
            వ్రతభంగమైన జీవనముగోరి
యిహలోకమందు నే నేల నిల్చెద నేఁడు
            బ్రహ్మైక్యసంసిద్ధిఁ బడయుదాన
నిదె చూడు మనుచు దా నేకాగ్రచిత్తమై
            కోటీశు హృత్పద్మకోశమందు

నిలిపి శరదభ్రరుచిరయు, నీలకంఠ
చంద్రమకుటయు, పటుజటాసాంద్రకాంతి
మహిత ఫణిరాజ భూషయు, మాననీయ
యైన తన్మూర్తిఁ బూజల నందఁజేసి. 149

మున్ను సనకాదులకు మౌనముద్రచేత
పరమవిజ్ఞాన మొసఁగిన భవ్యమూర్తి
యిదిగదా యంచు మదినెంచి యిందువదన
ధ్యానమొనరించి కనువిచ్చు నంతలోన. 150