పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

119

తన కుదయించి ముందటఁ గనపట్టు శిశు వదృశ్యంబగుటయు, తనదు కన్యాత్వంబుఁ జెడకుండుటయు, దనకు దేహాయాసంబు లేకుండుటయు, జూచి యంతయు మామకదైర్య పరీక్షార్ధం బమ్మహాత్ముండు చేసిన మాయా ప్రభావంబనియు నీ జంగమమూ ర్తి సాక్షాత్కోటీశ్వరుండెయనియు నెఱింగి, తనకుఁ బ్రారబ్ధ కర్మక్షయంబగుటకు సంతసించి విదేహముక్తి నొంద దలంచి తన మనంబున నిట్లని వితర్కించె. 151


దేహమందున బ్రహ్మాండ గేహమందు
బ్రహ్మమంతటఁ బూర్ణమై బరగుచుంట
సద్గురుండగు నిమ్మహాసంయమీంద్రు
కరుణచేఁగాక యొండు సంగతిని గలదె ! 152

అని విచారించి 153

అంతటఁ దత్ప్రసాదమున నాత్మసమాధినిఁ జెంది చిత్త వి
శ్రాంతి వహించి, యా సతి విరాజితచిద్గగనస్వరూపయై
యంతయుఁ దానె యౌచును శివైక్యతఁ జెందిన మౌనిచంద్రుఁడున్‌
స్వాంతమునందు సంతసిలి శైలగుహాంగణభూమి నిల్చినన్‌. 154

అంతట 155

నిత్య మా భీరకాంత దా నియతి వచ్చు
కాల మేగిన రాకున్న గడువిచార
మంది సాలంకుఁ డజ శిఖరాగ్రమెక్కి
యందు గుహపొంతనున్న య య్యతినిఁ గాంచి. 156

సాష్టాంగ మెఱిఁగిన సంయమి యిట్లను
             సాలంక : మున్నొక్క సమయమందు
నీకు దర్శనమిచ్చి నే నంత నంతర్హి
             తుండ నై రుద్రాఖ్యఁ దొడరు శిఖర