పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

97



లింగంబయ్యెననుచు భావించి హృత్పద్మంబున ధ్యానంబు సేయుచుండె మఱియు. 47

దక్షిణాయనమందు నుద్ధతి వహించి
మంచు తన రుచి మిగుల మాయించెననుచు
మంచుకొండకు నేగి యా మంచు నణప
నర్కుడంతట నుత్తరాయణము నొందె.48.

శిరమునఁదాల్చె గంగ శశిశేఖరు డా హరి వార్ధిఁ జొచ్చె వా
గ్వరుఁడు సరోజ పీఠిక నివాసము నేసెను వార్ధి యిందునిం
బోరసె సుధాంధు ల య్యమృతముం గొనిరంతయు మండువేసవిం
దురధిగమార్కతాప మతి దుస్సహమైనను భీతచిత్తులై .49

ప్రసను పాంధుల సతు లిచ్చు వారిఁ ద్రాగి
యిది ధరామృత మతి తృప్తినిచ్చే మాకు
నింక నధరామృతము వీరియెడను గలుగు
నది లభించిన నమృ తత్వ మబ్బు వండ్రు,50

అట్టి వేసవి ఘోర వనాంతరముల
నెండగాలికి నోర్చి కోటీశు పూజ
సేయుటకు బిల్వదళము లమేయ పుష్ప
వితతి దెచ్చును సాలంకవిభుఁడు భక్తి.51


ఆలయక పుండరీక వకుళావళి తా నొక దండఁజేసి నీ
ర్మలమగు లింగమూ ర్తి కటు మౌళిని జుట్టుట నెంచి చూడఁగా
నలువ కపాలమాలిక ఘనంబుగ మూర్ధముఁజుట్టికొన్న యా
మలహరు దివ్యవిగ్రహ సమత్వము గాంచివలీలఁ దోఁచెడిన్ . 52