పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

96

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

అంత శరత్కాలంబు ని
తాంతాచ్ఛాంభో విహార తత ధవళ గరు
త్క్రాతాంబుజాత పటలీ
కాంతం బరుదెంచె శీతకారణమగుచున్ .45

ఉష్ణాంకు కిరణ జాలం
బుష్టత్వముమానె నహ్నియుడిగెను తీవ్రం
బుష్టంబులైన వస్తువు
లుష్ణత్వముమాని శైత్య మొందెను వేగన్ .45

శివుఁడు ఫాలమునందుఁ జేర్చె నగ్నిజ్వాల
           వెన్నుండు కార్చిచ్చు వేగమ్రింగె
పాధోనిధానంబు బాడబానలమానె
           కమలారి సూర్యసంగతి వహించె
నంభోదములు వైద్యుతానలస్థితులయ్యె
          వజ్రి వజ్రంబు కేవలముబూనె
తరువు అంతర్వహ్ని నిరవొందగా దాల్చె
          శిలలు లోవహ్నిని జేర్చుకొనియె
జనము లింటింట కుంపటు లెనయ నిల్పి
రడవులందున నెగడులు గడలుకొల్పి
రపుడు వనచరు లా శీత మఖిలలోక
బాధలొనరింప నెంతయు భయమునొంది.46

అట్టి శీతకాలంబునఁ బ్రొద్దుపొడుపునఁ జల్లని నీటందోగి యమ్మహాత్ముండు
సీతభసిత లిప్తపదేహండై భద్ర రుద్రాక్ష మాలాలంకృతగ్రీవుండై పంచాక్షరీ
జపంబు చేయుచుఁ గోటీశ్వర మహాలింగంబునకు షోడశోపచార పూజలు
గావించి కోటీశ్వరాష్టోత్తర శతనామంబుల బిల్వపత్రార్చనంబు జేసి మల్లికా
మాలికా దామంబు లా లింగమూర్తి కంతటంజుట్టి యీ లింగంబే మల్లికార్జున