పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


ప్రాణ భావాఖ్య లింగ సంబంధములుగ
జేసి నిత్యంబు శివపూజ సేయుచుండు
వీరశైవుండు షడ్వర్గ విజయశాలి
ప్రకట రుచిహేళి సాలంక భక్తమౌళి. 33

శ్రుతుల పురాణాద్యాగమ
వితతుల శివుఁ డధికుఁ డనుచు వేమఱు వినుటన్
శ్రుతిమత మని శివభక్తిని
సతతము నంగీకరించి సలుపుచునుండున్ .34

కఠిన కాయికవృత్తి యుత్కటముగాఁగ
జేసి యార్జించు ద్రవ్యంబుచేత జంగ
మాళిఁ బూజించుటే ముఖ్యమని తలంచి
కట్టెలమ్మేటి నెఱకాయకంబు పూని,35

తమ్ములతోడగూడి విహితమ్ముగ న న్నగరాజమెక్కి నె
త్తమ్ముననుండు న వ్వనవితానమునందున నొప్పు పెద్ద భూ
జమ్ముల శాఖలెక్కి పయిసాగిన కట్టెలు కొట్టితెచ్చి తా
నమ్మిన తత్క్రయంబుననె నాతఁడొనర్చును జంగమార్చనల్.36

కోటికిఁబడగెత్తు వన కీ
రాటకు లవ్వీట గలుగ రాయస్థితికై
పాటించి వారి నడుగరు
జూటేందుకళావతంసు జూచిన కతనన్.37

ఆ పురంబున గట్టెల నమ్ముకొఱకు
నా త్రికూటాద్రికూటంబులందుగల్గు
శుష్కతరువులు ఖండించి పొలసి యంత
కోటిలింగేళ్లు దర్శించుఁ గోర్కెదీర38