పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


శబ్దాది వైఖరీజాలంబు నింద్రియ
       మధ్యమస్థితియందు మట్టు పఱచి
యింద్రియ మధ్యమ నేపార మానస
          పశ్యంతి లోపల పరగ నిలిపి
మానసపశ్యంతి మానక హంసయౌ
         నా పరాశక్తియం దణఁగఁజేసి
యా పరాశక్తిని నమల చిదానంద
         రూపంబుగాఁ జేసి రూఢిమెరయ
నట్టి రూపంబు దానయై యఖిలవస్తు
చయములోపల వెల్గుచు సర్వభూత
తతి విలోకించి కావించెఁ దపము మిగుల
నిలినగర్భుఁడు నిర్మలానందుఁ డగుచు.212

ఇట్లు గొంతకాలంబు జిరసమాధినిష్ఠుండై యుండునంత నా చిదాకాశ
మధ్యంబునందుఁ బరచలనంబై పశ్యంతీపదంబొందు సమయంబున,213

పొడచూపెన్ శతకోటిభాస్కరకరస్ఫూర్జత్ప్రభాశాలియై
యుడురా డర్ధ కిరీటుఁడై సురనదీప్రోద్యజ్జటాజూటుఁడై
కడిమిం బన్నగభూషణుండయి శుభాకారుండునై దిక్కులం
దెడలేకన్ బ్రమథాళిఁ గొల్వఁగను గోటీశుండు బ్రత్యక్షమై.214

అట్లు ప్రత్యక్షమైనట్టి యభవుఁజూచి
మధ్యమావైఖరులఁ గూడి మహిమదనరి
పద్మగర్భుండు సంతోష భరితుఁడగుచు
నుతుల గావించె నానంద మతిశయిల్ల.215


దేవా యీ చిదాకాశ రూపంబగు పరమ శివ సముద్రంబున ఘృత కాఠిన్య
మూర్తినగు నీవును, విష్ణుండును, నేనును త్రిగుణాత్మికయగు ప్రకృతియు