పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

83


మాఖమాసంబున మహిత విరించ్యాఖ్య
         శిఖరాగ్రమందున జెలఁగి నిలిచి
ప్రాచీన కోటీశు పాపవినాశన
         నూత్న కోటీశ్వరానూనలింగ
మూర్తులను బూజగావించి ముక్తి కార
ణంబయిన మహాలింగార్చనంబు చేసి
భూసురుల కన్న మిచ్చిన పుణ్యఫలము
శేష భాషాపతులకైనఁ జెప్పఁ దరమె:208

మఱియు న మ్మహాగిరి యాత్రికులగు వారలు విష్ణుశిఖరంబు నెక్కి పాప
నాశనీ ద్రోణికా జలస్నానంబు జేసి పాపవినాశన లింగంబు బూజించి
విగతపాపులై నూత్న కోటీశ్వర సోపాన మధ్యస్థ వల్లపాంగనా దర్శనంబు
జేసి బ్రహ్మశిఖరస్థ నూత్న కోటీశ్వర లింగంబును తత్పరివార లింగంబుల
సేవించి యోంకార నదీజలంబులఁ దీర్ఘవిధు లొనరించిన నిది పూర్ణయాత్ర
యగు నిందుఁ బ్రథమ సేవ్యంబగు పాపనాశన లింగంబును నచటి విష్ణుం
డును సురగణంబును నేవింపుచుండు నిక నూత్న కోటీశ్వర లింగావిర్భావం
బెట్టిదనిన.209

అంతఁ గొంతకాలంబున కబ్జభవుఁడు
"రుద్ర హరికూటముల లింగరూప మొంది
శివుఁడు నిలిచెను మామక శిఖరమందు
దనర లింగంబు నిల్పెను దపము జేసి. "210

అనుచుఁ జింతించి బిల్వవనాంతరమున
బద్ధ పద్మాసనస్థుఁడై భవ్యలీల
హంసమార్గానువర్తియై యమలభక్తి
తపముజేసి కోటీశు జిత్తమున నిల్పి. 211