పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

దక్షిణామూర్తి రజితభూధరము విడిచి
యా త్రికూటాద్రి రుద్ర కూటాద్రి సీమ
లలిత కోటీశలింగమై నిలిచె విష్ణు
శృంగమందు పాపవినాశ లింగమయ్యె.203

ఆ లింగము జ్యోతిర్మయ
మా లింగము చిత్ప్రకాశ మఖిలాధారం
బా లింగమూర్తిఁ గొలిచిన
దూలును సంసారమాయ దురితం బడగున్. 204

ఆ లింగంబు భజింపఁ గల్గు నఖిలేష్టార్థంబు లీలోకమం
దా లింగంబు భజింపఁ గల్గు నతి ఘోరాఘచ్చటాభేదనం
డా లింగంబు భజింపఁ గల్గు నవవర్గానందమందంబుగా
నా లింగంబు భజింప కుండు నరులాహా! యెంత పాపాత్ములో205

మహితకార్తీక శ్రావణ మాఘమాస
ములను పాపనాశనియందు మునింగి దొనను
పూని లింగార్చనము సేయు మానవులకు
గరిమతో భోగమోక్షముల్ గల్గు టరుదె206


అందుఁ గార్తిక మాసమం దధికభక్తి
నచట నిల్చి లింగార్చనం బమరఁ జేయు
నతని కీశుండు నచ్చోట నధివసించు
సిద్ధమండలి ప్రత్యక్షసిద్ధి నొసఁగు.207.

శ్రావణమాసంలు సరస రుద్రాభిఖ్య
         శిఖరాగ్రమందునఁ జేరి నిలిచి
కార్తికమాసంబు కమలాక్ష శిఖరాగ్ర
       నిర్మల స్థలమున నియతి నిలిచి